Jump to content

Jaffas ki naa gift


nag_mama

Recommended Posts

52 minutes ago, nag_mama said:

enti vuncle asalu maa kaasu gaadi dhyryam  Indira gandhi  ne party nunchi suspend cheyyadam :giggle: snfkXU-shared.gif

లోక్ సభ ఎన్నికల్లో ఓటమి తర్వాత కాంగ్రెస్‌లో వర్గ పోరు మొదలైంది. 1977 మే 6న కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో ఇందిర అనుచరుడు, ఎమర్జెన్సీ విధించాలని ఆమెకు సలహా ఇచ్చిన సిద్దార్ధ శంకర్ రాయ్‌ను కాసు బ్రహ్మానందరెడ్డి ఓడించారు. ఇందిరా గాంధీ, కాసు మధ్య విబేధాలు తలెత్తడంతో కాంగ్రెస్ రెండుగా చీలిపోయింది. ఓ వర్గానికి కాసు బ్రహ్మానంద రెడ్డి, మరో వర్గానికి ఇందిర నాయకత్వం వహించారు. 1978 జనవరి 1, 2 తేదీల్లో భేటీ అయిన ఇందిర వర్గం ఆమెను తమ అధ్యక్షురాలిగా ఎన్నుకున్నారు. దీంతో జనవరి 3న బ్రహ్మానందరెడ్డి ఇందిరను, ఆమె వర్గీయులను పార్టీ నుంచి బహిష్కరించారు. కాసు నాయకత్వంలోని అసలు పార్టీనే రెడ్డి కాంగ్రెస్‌గా గుర్తింపు పొందింది.

తర్వాత కొద్ది రోజులకే ఇందిరా గాంధీ.. కాంగ్రెస్(ఐ) పార్టీని స్థాపించారు. కాంగ్రెస్ ఎన్నికల గుర్తయిన ఆవు-దూడ సింబల్‌ను ఎన్నికల సంఘం బ్రహ్మానందరెడ్డి వర్గానికి కేటాయించింది. దీన్ని సవాల్ చేస్తూ ఇందిర వర్గం సుప్రీం కోర్టుకు వెళ్లారు. కానీ ఈ విషయంలో జోక్యం చేసుకోవడానికి అత్యున్నత ధర్మాసనం నిరాకరించింది.

1978 జనవరి 13న ఆంధ్రప్రదేశ్‌తోపాటు ఆరు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. ఫిబ్రవరి 24న ఎన్నికలు జరుగుతాయని నోటిఫికేషన్ వెలువరించింది. అప్పటికీ ఇందిరా గాంధీ పార్టీ పెట్టి రెండు నెలలు కూడా కాలేదు. ఈసీ ఆ పార్టీకి సింబల్ కూడా కేటాయించలేదు. పెద్ద నాయకులంతా బ్రహ్మానందరెడ్డి కాంగ్రెస్‌లో ఉండగా.. ఇందిరా కాంగ్రెస్‌లో చెప్పుకోదగ్గ నేతలెవరూ లేరు.

ఇలాంటి పరిస్థితుల్లో ఉత్తరప్రదేశ్ గవర్నర్‌గా ఉన్న మర్రి చెన్నారెడ్డి తన పదవికి రాజీనామా చేసి ఏపీలో ఇందిరా కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలను చేపట్టారు. ఎంపీగా గెలిచిన పీవీ నర్సింహారావు డిల్లీలో ఇందిరకు తోడుగా ఉన్నారు.

 



మరో మూడు వారాల్లో ఎన్నికలు ఉన్నాయనగా.. ఎన్నికల సంఘం ఇందిరా కాంగ్రెస్ ‘హస్తం’ గుర్తును కేటాయించింది. కానీ ఆమె పార్టీకి అభ్యర్థులే కరువయ్యారు. దీంతో చదువుకొని, డిపాజిట్ కట్టగల యువకులందరికీ ఆమె టికెట్లు ఇచ్చారు. హేమాహేమీల్లాంటి నేతలున్న రెడ్డి కాంగ్రెస్సే ఎన్నికల్లో గెలుస్తుందనే అంచనాలు ఉండేవి.

కానీ ఫలితాలు మాత్రం కాసు వర్గానికి షాకిచ్చాయి. ఇందిరా కాంగ్రెస్ 175 స్థానాల్లో విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో బ్రహ్మానంద రెడ్డి వర్గం 30 స్థానాలకు పరిమితం కాగా.. జనతా పార్టీ 60 సీట్లను గెలుచుకుంది. 1980 లోక్ సభ ఎన్నికల నాటికి ఈసీ ఇందిరా కాంగ్రెస్‌నే అసలైన కాంగ్రెస్‌గా గుర్తించింది.

1977 లోక్ సభ ఎన్నికల్లో నీలం సంజీవ రెడ్డి నంద్యాల నుంచి జనతాపార్టీ తరఫున ఎంపీగా ఎన్నికయ్యారు. దీంతో ఏపీ ఎన్నికల్లో రాయలసీమలో ఆయన వర్గం జనతా పార్టీ కోసం పని చేసింది.

ఇక వైఎస్ రాజశేఖర రెడ్డి విషయానికి వస్తే.. 1978లోనే ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆయన.. కాసు బ్రహ్మానంద రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ తరఫున పులివెందుల నుంచి పోటీ చేసి 21 వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు. జనతా పార్టీకి పులివెందులలో 27 వేల ఓట్లొచ్చాయి. రాష్ట్రంలో 175 స్థానాల్లో గెలుపొందిన ఇందిరా కాంగ్రెస్.. పులివెందులలో మాత్రం 5 వేల ఓట్లు కూడా పొందలేకపోయింది.

 

 

Nakka sandral ki kasu gadu inspiration emo CITI_c$y

  • Haha 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...