Somedude Posted July 9, 2021 Report Share Posted July 9, 2021 RRR ప్రెస్సుమీట్స్ మిస్ అవుతున్నాం. ఆలా అని RRR సైలెంట్ గా అయితే లేరు. లెటర్స్ రూపం లో ప్రతి రోజు ప్రజల సమస్యల ని ఒక నిబద్ధధ కలిగిన ఎంపీ గా ఒక్కొకటి గా ప్రజల తరుపున ప్రభుత్వంని రిక్వెస్ట్ చెయ్యడం జరుగుతుంది. లెటర్స్ ఇక్కడ పోస్ట్ చేస్తున్నాం. దయ చేసి లెటర్స్ తప్ప వేరే RRR రిలేటెడ్ టాపిక్స్ పోస్ట్ చెయ్యవొద్దు అని మనవి. 1 Quote Link to comment Share on other sites More sharing options...
Somedude Posted July 9, 2021 Author Report Share Posted July 9, 2021 రెడ్డి ఎంటర్ప్రైజెస్ చేస్తున్న వసూళ్లపై తక్షణమే విచారణ జరిపించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ ముఖ్యమంత్రి శ్రీ వై.యస్. జగన్ మోహన్రెడ్డి గారికి లేఖ రాసిన నరసాపురం పార్లమెంటు సభ్యులు శ్రీ రఘురామకృష్ణ రాజు గారు. రాష్ట్రానికి వేల కోట్ల ఆదాయాన్నిచ్చే ఏపీబెవరేజెస్ సంస్థ ఉద్యోగులు వారి సమస్యలను తమ దృష్టికి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారని కానీ తమరు అవకాశం ఇవ్వకపోవడంతో ఈ సమస్యలను తన దృష్టికి తీసుకొచ్చినట్లు తెలిపారు. 6 నెలల క్రితం రెడ్డి ఎంటర్ప్రైజెస్ ఏజెన్సీ సుమారు 10,258 మంది ఉద్యోగులకు నెల జీతం చెల్లించాలంటూ రాష్ట్రంలోని మద్యం షాపుల నుంచి దాదాపు 5 కోట్ల రూపాయలు వసూలు చేసేందుకు పకడ్బందీ ప్లాన్ వేసిందని, ఇప్పుడు మరో 10.25 కోట్ల వసూలు చేసేందుకు ప్లాన్ వేసిందని, ఈ సంఘటనలపై డిప్యూటీ సీఎంకు ఫిర్యాదు చేసినా ఇంకా ఎటువంటి విచారణ చేపట్టలేదని పేర్కొన్నారు. 2 Quote Link to comment Share on other sites More sharing options...
Somedude Posted July 9, 2021 Author Report Share Posted July 9, 2021 రైతు దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని రైతుల బాధలను అర్ధం చేసుకుని ధాన్య సేకరణ నిమిత్తం వారికి చెల్లించాల్సిన బకాయిలను తక్షణమే చెల్లించాలని కోరుతూ ముఖ్యమంత్రి శ్రీ వై.యస్.జగన్ మోహన్ రెడ్డి గారికి లేఖ రాసిన నరసాపురం పార్లమెంటు సభ్యులు శ్రీ రఘురామకృష్ణ రాజు గారు. రైతుల నుంచి సేకరించిన ధాన్యానికి సుమారు రూ.1,619 కోట్లు చెల్లించాల్సి ఉందని, ధాన్యం సేకరణ కోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే నిధులు విడుదల చేసిందని తెలిపారు. కేంద్రం విడుదల చేసిన నిధులను ఇతర పథకాల కోసం మళ్లించకుండా రైతుల బకాయిలు చెల్లించేందుకు మాత్రమే వినియోగించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుతో రైతులను దళారులు దోచుకుంటున్నారని, రైతు పేరును పార్టీ పేరులో మాత్రమే కాదు వారిని గుండెల్లో కూడా పెట్టుకోవాలని పేర్కొన్నారు. 1 Quote Link to comment Share on other sites More sharing options...
Somedude Posted July 9, 2021 Author Report Share Posted July 9, 2021 గౌరవ సుప్రీంకోర్టు ఇప్పటికే రద్దు చేసిన ఐటి చట్టం 66 (ఏ) కింద నమోదు చేసిన కేసులను తక్షణమే ఉపసంహరించుకోవాలని, ఇలాంటి కేసులలో కోర్టు ఇచ్చిన తీర్పులను, సూచనలను పరిగణనలోకి తీసుకుని రాష్ట్రంలో చట్టాలు సక్రమంగా అమలు అయ్యేలా తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ ముఖ్యమంత్రి శ్రీ వై.యస్.జగన్ మోహన్ రెడ్డి గారికి లేఖ రాసిన నరసాపురం పార్లమెంటు సభ్యులు శ్రీ రఘురామకృష్ణ రాజు గారు. రాష్ట్రంలో సోషల్ మీడియా యాక్టివిస్టులపై రాష్ట్ర ప్రభుత్వం ఐటి చట్టం 66 (ఏ) సెక్షన్ ప్రకారం విచ్చలవిడిగా తప్పుడు కేసులు బనాయిస్తున్నట్లు పౌర సమాజం, మానవహక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయని, పోలీసులు ఇక నుంచి అయినా కేసుల నమోదుపై తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఐ టి చట్టం సెక్షన్ 66 (ఏ) కి సంబంధించి కోర్టు ధిక్కరణ చర్యగా భావించి సుప్రీంకోర్టు తనంత తానుగా (సుమోటో) కేసు స్వీకరించే అవకాశం ఉందని తెలిపారు. మహిళ పట్ల నిర్దిష్టమైన నేరాలు చేసే వారికి సంబంధించిన కేసులను 21 రోజుల్లో పరిష్కరించి వారికి శిక్ష పడేలా చేయాలని "దిశ" చట్టం తీసుకువచ్చారని, అయితే కేంద్రం నుంచి అనుమతి రాకుండానే 18 దిశ పోలీసు స్టేషన్లను మరియు దిశ యాప్ ను కూడా మొదలు పెట్టారని తెలిపారు. దిశ యాప్ లాంటి సాంకేతిక అంశాలు ప్రవేశ పెట్టడం ప్రశంసనీయమే అయినా తద్వారా వచ్చే ఫిర్యాదులను దిశ చట్టం కింద నమోదు చేయాలంటే ముందుగా ఈ దిశ చట్టాన్ని కేంద్రం ఆమోదించాల్సి ఉంటుందని లేదంటే రాజ్యాంగ పరమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. 1 Quote Link to comment Share on other sites More sharing options...
Somedude Posted July 9, 2021 Author Report Share Posted July 9, 2021 ప్రభుత్వంలో శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి గారి హోదా, అధికారంపై స్పష్టత ఇవ్వాలని కోరుతూ ముఖ్యమంత్రి శ్రీ వై.యస్.జగన్ మోహన్ రెడ్డి గారికి లేఖ రాసిన నరసాపురం పార్లమెంటు సభ్యులు శ్రీ రఘురామకృష్ణ రాజు గారు. ప్రభుత్వ సలహాదారుగా ఉండి మంత్రులు సమాధానం చెప్పవలసిన అంశాలపై కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారే ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం ఏంటి అని ప్రజలు అనుకుంటున్నారని, అందుకే ముఖ్యమంత్రి గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారి పాత్ర మీద వివరణ ఇవ్వాలని కోరారు. 1 Quote Link to comment Share on other sites More sharing options...
Somedude Posted July 9, 2021 Author Report Share Posted July 9, 2021 రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ఇసుక పాలసీని తక్షణమే మార్చాలని కోరుతూ ముఖ్యమంత్రి శ్రీ వై.యస్.జగన్ మోహన్ రెడ్డి గారికి లేఖ రాసిన నరసాపురం పార్లమెంటు సభ్యులు శ్రీ రఘురామకృష్ణ రాజు గారు. ఇసుక సరఫరా బాధ్యతను కాంట్రాక్టర్ లకు అప్పగించిన తరవాత రాష్ట్రంలో ఇసుక కొరత తీవ్రమైందని, నిర్మాణ రంగంలో ఉపాధి అవకాశాలు పడిపోయాయని, ప్రభుత్వం తీసుకువచ్చిన రెండో ఇసుక పాలసీ కూడా దారుణంగా విఫలమైందని, ఇప్పుడు మూడో ఇసుక పాలసీ కోసం పత్రికా ప్రకటనలు కూడా ఇచ్చారని పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీకి భిన్నంగా ఇసుక ర్యాంపుల దగ్గర దళారీల ప్రమేయం ఉందని అన్నారు. అన్ని చోట్లా ఒకే ధరకు ఇసుక లభించేలా వెంటనే ఇసుక పాలసీను మార్చాలని కోరారు. 2 Quote Link to comment Share on other sites More sharing options...
jawaani_jaaneman Posted July 9, 2021 Report Share Posted July 9, 2021 Season-2 epudu start ? meesam meleyadam scene baaga kudirindi first season lo... second season lo kuda ilanti scenes vunaya ? 1 Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted July 9, 2021 Report Share Posted July 9, 2021 22 minutes ago, jawaani_jaaneman said: Season-2 epudu start ? meesam meleyadam scene baaga kudirindi first season lo... second season lo kuda ilanti scenes vunaya ? Yea season 2 opening shot da babu malli jail lo tennis 🎾 kottukune shot tho estart avudi ending ki bro anil ap cm avutadu.. idi da sequence Quote Link to comment Share on other sites More sharing options...
jawaani_jaaneman Posted July 9, 2021 Report Share Posted July 9, 2021 7 minutes ago, psycopk said: Yea season 2 opening shot da babu malli jail lo tennis 🎾 kottukune shot tho estart avudi ending ki bro anil ap cm avutadu.. idi da sequence Chandranna pasupu kumkuma panche scene kaka…chala baaga kudirindi, background lo Amaravati skyline… Quote Link to comment Share on other sites More sharing options...
Somedude Posted July 9, 2021 Author Report Share Posted July 9, 2021 గౌరవ హైకోర్టు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పదవిలో మరియు పార్టీ పదవిలో కొనసాగుతున్న సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ఎదో ఒక్క పదవికి మాత్రమే పరిమితం చేయాలని సూచిస్తూ ముఖ్యమంత్రి శ్రీ వై.యస్.జగన్ మోహన్ రెడ్డి గారికి లేఖ రాసిన నరసాపురం పార్లమెంటు సభ్యులు శ్రీ రఘురామకృష్ణ రాజు గారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రభుత్వ సలహాదారుడిగా కొనసాగుతూ పార్టీ వ్యవహారాలు చూడడం సరికాదని, ఈ విషయంపై సరైన నిర్ణయం తీసుకోవాలని కోరుతూ ఈ నెల 6వ తేదీన మీకు లేఖ రాశానని, ఇప్పుడు ఇదే విషయంపై రాష్ట్ర హైకోర్టు కూడా వ్యాఖ్యానించిందని అన్నారు. ఈ నెల 19 న తదుపరి విచారణ జరిగే లోపు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ఎదో ఒక పదవికే పరిమితం చేస్తే ముఖ్యమంత్రిగా మీ గౌరవం పెరుగుతుందని లేకపోతే ఈ అంశంపై విమర్శనాస్త్రాలు సంధించేందుకు ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చినట్టవుతుంది అని పేర్కొన్నారు. 1 Quote Link to comment Share on other sites More sharing options...
ShruteSastry Posted July 9, 2021 Report Share Posted July 9, 2021 ఉత్తరాలు రాయడమేన లేక ఎన్నికైన నియోజకవర్గాల్లోని ఏదైనా పని చేస్తున్నారా రాజు గారు? 1 Quote Link to comment Share on other sites More sharing options...
ticket Posted July 9, 2021 Report Share Posted July 9, 2021 3 hours ago, Somedude said: రెడ్డి ఎంటర్ప్రైజెస్ చేస్తున్న వసూళ్లపై తక్షణమే విచారణ జరిపించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ ముఖ్యమంత్రి శ్రీ వై.యస్. జగన్ మోహన్రెడ్డి గారికి లేఖ రాసిన నరసాపురం పార్లమెంటు సభ్యులు శ్రీ రఘురామకృష్ణ రాజు గారు. రాష్ట్రానికి వేల కోట్ల ఆదాయాన్నిచ్చే ఏపీబెవరేజెస్ సంస్థ ఉద్యోగులు వారి సమస్యలను తమ దృష్టికి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారని కానీ తమరు అవకాశం ఇవ్వకపోవడంతో ఈ సమస్యలను తన దృష్టికి తీసుకొచ్చినట్లు తెలిపారు. 6 నెలల క్రితం రెడ్డి ఎంటర్ప్రైజెస్ ఏజెన్సీ సుమారు 10,258 మంది ఉద్యోగులకు నెల జీతం చెల్లించాలంటూ రాష్ట్రంలోని మద్యం షాపుల నుంచి దాదాపు 5 కోట్ల రూపాయలు వసూలు చేసేందుకు పకడ్బందీ ప్లాన్ వేసిందని, ఇప్పుడు మరో 10.25 కోట్ల వసూలు చేసేందుకు ప్లాన్ వేసిందని, ఈ సంఘటనలపై డిప్యూటీ సీఎంకు ఫిర్యాదు చేసినా ఇంకా ఎటువంటి విచారణ చేపట్టలేదని పేర్కొన్నారు. Eddy enterprise aa.. E toka gallu direct danda chestunnaru Quote Link to comment Share on other sites More sharing options...
NiranjanGaaru Posted July 9, 2021 Report Share Posted July 9, 2021 4 minutes ago, ShruteSastry said: ఉత్తరాలు రాయడమేన లేక ఎన్నికైన నియోజకవర్గాల్లోని ఏదైనా పని చేస్తున్నారా రాజు గారు? Prajalaki pani cheyali a??? E kaalam lo unav guru Prajale pedda porambokulu vallaaki endhi chesedhi 50 cr petti konukadau election time lo, maro 50 to jaggad, lite 1 1 Quote Link to comment Share on other sites More sharing options...
Somedude Posted July 9, 2021 Author Report Share Posted July 9, 2021 2 minutes ago, NiranjanGaaru said: Prajalaki pani cheyali a??? E kaalam lo unav guru Prajale pedda porambokulu vallaaki endhi chesedhi 50 cr petti konukadau election time lo, maro 50 to jaggad, lite DB Intellect @ShruteSastry gaariki vishayam thakkuva. News follow avvadhu, context theloyadhu. Jaggadini ante thattukoledhu. 1 Quote Link to comment Share on other sites More sharing options...
ShruteSastry Posted July 9, 2021 Report Share Posted July 9, 2021 3 minutes ago, NiranjanGaaru said: Prajalaki pani cheyali a??? E kaalam lo unav guru Prajale pedda porambokulu vallaaki endhi chesedhi 50 cr petti konukadau election time lo, maro 50 to jaggad, lite అలాగ, Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.