Jump to content

***** Andhra High Court Daily Updates ******


Recommended Posts

Posted
1 hour ago, kidney said:

Some high courts are running parallel govts: Solicitor General 

Solicitor general Tushar Mehta, representing the central government, was critical of various high courts passing orders 

The issue is some high courts are running parallel governments," Mehta said.

Various high courts including Gujarat, Madras, Karnataka and Andhra Pradesh had passed directions to state and central governments

  "All these letters which have been addressed to the court to persuade Supreme Court to take suo motu cognizance of issues have been written by people who are earning in crores," Mehta said to SC

 

Mana AP fud court umpires ki akshantalu(muttakayalu)  padthunnayi kadha one-by-one for being biased to one political party  from SC and Central @3$%

Please start a CBI investigation on this person. 

Posted
 

వేలం ప్రక్రియ కొనసాగించుకోండి

05292020021050n59.png

 

  • కానీ టెండర్లను ఖరారు చేయవద్దు
  • భూముల విక్రయంపై సర్కారుకు హైకోర్టు స్పష్టీకరణ..18కి వాయిదా
  • 11న వేలం: మిషన్‌ బిల్డ్‌ ఏపీ డైరెక్టర్‌

 

అమరావతి, మే 28 (ఆంధ్రజ్యోతి): విశాఖ, గుంటూరు జిల్లాల్లోని తొమ్మిది చోట్ల భూముల వేలానికి సంబంధించిన ప్రక్రియను కొనసాగించుకునేందుకు హైకోర్టు అంగీకరించింది. అయితే టెండర్లను ఖరారు చేయరాదని రాష్ట్ర ప్రభుత్వానికి తేల్చిచెప్పింది. తదుపరి విచారణను జూన్‌ 18వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ఏవీ శేషసాయి, జస్టిస్‌ బీ కృష్ణమోహన్‌తో కూడిన ధర్మాసనం గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం విక్రయించదలచిన భూముల్లో గతంలో దాతలు ఇచ్చినవి ఉన్నాయని, నిబంధనల మేరకు వాటిని విక్రయించడానికి వీల్లేదంటూ హైకోర్టులో ఐదు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలైన విషయం తెలిసిందే. ఈ పిటిషన్లపై గురువారం మరోమారు ధర్మాసనం ఎదుట విచారణ జరిగింది.

 

ఈ సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. ఈ నెల 28వ తేదీ నుంచే భూముల వేలం ప్రక్రియ జరగనుందని, చట్టనిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న ఈ తంతును అడ్డుకోవాలని అభ్యర్థించారు.  2012 లో తీసుకొచ్చిన భూకేటాయింపు విధానం మేరకు ఈ భూముల్ని విక్రయించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేదని వివరించారు. గుంటూరులో విక్రయించతలపెట్టిన స్థలంలో మార్కెట్‌ కొనసాగుతోందని, ప్రజావసరాలకు అనుగుణంగా ఉన్న దీనిని విక్రయించరాదని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్‌ జనరల్‌ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ..భూముల వేలం వాయిదా పడిందని, జూన్‌ 11 నుంచి 13వ తేదీ వరకు వేలం నిర్వహించనున్నామని తెలిపారు. ప్రభుత్వం విక్రయించతలచిన భూములన్నీ ఖాళీ స్థలాలని పేర్కొన్నారు. వాటిని విక్రయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని వివరించారు. ఇరువురి తరఫు వాదనల్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. దీనిపై మరింత అధ్యయనం చేయాల్సి ఉందంటూ విచారణను వాయిదా వేసింది. 

 

వినతులమేరకే పొడిగింపు : ప్రవీణ్‌కుమార్‌

ప్రభుత్వ భూముల వేలాన్ని జూన్‌ 11న చేపడతామని మిషన్‌ బిల్డ్‌ ఏపీ డైరెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం, శుక్రవారం విశాఖ, గుంటూరుల్లోని తొమ్మిది భూముల అమ్మకానికి వేలం నిర్వహించాల్సి ఉంది. అయితే, వేలం తేదీని పొడిగించాలని తమకు పెద్ద ఎత్తున విన్నపాలు వచ్చాయని ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. దీంతోపాటు వేలంలో మరింత మంది పాల్గొనేందుకు అవకాశం కల్పించేందుకు కూడా ఈ నిర్ణయం తీసుకొన్నామని ఆయన వెల్లడించారు. 

 
Posted
1 minute ago, snoww said:

Please start a CBI investigation on this person. 

CB! inquiry on both SG and SC---directions ivvali.@3$%

Posted

విశాఖ సీబీఐకి డాక్టర్‌ సుధాకర్‌ కేసు
విశాఖ జిల్లా నర్సీపట్నం ఏరియా ఆసుపత్రి సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ డాక్టర్‌ కె.సుధాకర్‌ కేసును విచారించే బాధ్యతను విశాఖ సీబీఐ అధికారులకు అప్పగిస్తూ సీబీఐ కేంద్ర కార్యాలయ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు గురువారం ఆదేశాలు అందాయి. డాక్టర్‌ సుధాకర్‌ విషయంలో అధికారులు వ్యవహరించిన తీరుపై రాష్ట్ర హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతోపాటు కేసును విచారించి ఎనిమిది వారాల్లో నివేదిక సమర్పించాలని సీబీఐను ఆదేశించిన విషయం తెలిసిందే. పోలీసులు నమోదు చేసిన కేసునూ సీబీఐకు బదిలీ చేయాలని సూచించింది. మొత్తం వ్యవహారంలో కుట్ర కోణం ఉంటే తేల్చాలని ఆదేశించింది. ఒకట్రెండు రోజుల్లో విచారణ మొదలుపెట్టడానికి సీబీఐ అధికారులు సన్నాహాలు చేసుకుంటున్నారు.

Posted

Flash news.

Lemongadda is back. 

Gelichina justice. Thank you high court. 

Posted

monna mahandu lo lokesham 20 kgs lost

ninna world famous actor NTR birthday

ivala Lemongadda back with a bang...ordinance chelladu ante lemongadda victory anukuntunaru pulkalu

idi ra sketch ante...

Posted

అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ తొలగింపు వ్యవహారంపై ఏపీ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోలన్నీ రద్దు చేసిన ఉన్నత న్యాయస్థానం... రమేశ్‌ కుమార్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా తిరిగి నియమించాలని ఆదేశాలు జారీ చేసింది. ఎస్‌ఈసీ విషయంలో నిబంధనలు మారుస్తూ తెచ్చిన ఆర్డినెన్స్‌ను ధర్మాసనం కొట్టివేసింది. ఆర్టికల్‌ 213 ప్రకారం ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్డినెన్స్‌ ఇచ్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ క్షణం నుంచి రమేశ్‌కుమార్‌ ఎన్నికల కమిషనర్‌గా కొనసాగుతారని హైకోర్టే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జీకే మహేశ్వరి నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.

Posted

అమరావతి:  జగన్ సర్కారుకు ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్‌ తొలగింపు వ్యవహారంపై హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ విషయంపై కొన్ని రోజులుగా విచారణ జరిపిన ఉన్పత నాయ్యస్థానం ఎస్‌ఈసీ విషయంలో నిబంధనలు మారుస్తూ తెచ్చిన ఆర్డినెన్స్‌ కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది. అంతేగాక, ఈ విషయంలో ప్రభుత్వం తెచ్చిన జీవోలన్నీ కొట్టివేసినట్లు హైకోర్టు తీర్పునిచ్చింది. రమేశ్ కుమార్‌ను తిరిగి నియమించాలని కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆర్డినెన్స్‌ 213 ప్రకారం ప్రస్తుత పరిస్థితుల్లో ఆయనను తొలగించే అధికారం లేదని హైకోర్టు స్పష్టం చేసింది.

Posted

Doctor sudhakar ni kooda malli job loki theesukovali ani korukuntunna. High court please give justice to doctor sudhakar.

Posted
23 minutes ago, Android_Halwa said:

monna mahandu lo lokesham 20 kgs lost

ninna world famous actor NTR birthday

ivala Lemongadda back with a bang...ordinance chelladu ante lemongadda victory anukuntunaru pulkalu

idi ra sketch ante...

Blue sketch ahh

Posted

Em undi election notification vachaka poi CEC ki complaint chestaru lemon one side support chestadu ani

CEC vallu temp ga inkokadini tisukuvastaru

 

Posted
38 minutes ago, Hydrockers said:

Em undi election notification vachaka poi CEC ki complaint chestaru lemon one side support chestadu ani

CEC vallu temp ga inkokadini tisukuvastaru

 

Emundhi malli high court nundi supreme court dhaaka simple ga baadhudey baadhudu antu thannukuntu pothaaru simple ga... 

  • Haha 1
Posted
మరో 44 మందికి హైకోర్టు నోటీసులు

మరో 44 మందికి హైకోర్టు నోటీసులు

అమరావతి: న్యాయమూర్తులపై సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యల అంశంపై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ నేపథ్యంలో  మరో 44 మందికి ఉన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు చేసిన పాత్రికేయుడు కొమ్మినేని శ్రీనివాసరావు, పంచ్‌ ప్రభాకర్‌ సహా 44 మందికి నోటీసులు జారీ చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. ఇదే కేసులో రెండ్రోజుల క్రితం 49 మందికి హైకోర్టు నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణను మూడువారాల పాటు వాయిదా వేసింది.

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...